ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు రావాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర -2020 ఆహ్వాన పత్రికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారికి అందించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, మహబూబాబాద్ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తదితరులు.
ఆహ్వాన పత్రికను అందించిన తర్వాత మేడారం చరిత్ర, విశిష్టత తెలిపే విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించిన తీరును మంత్రి సత్యవతి రాథోడ్, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి వివరించారు.