ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్వహిస్తున్న శ్రీ సహస్ర మహా చండీయాగంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ క్రతువులను జరుపుతున్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి మరియు ఇతర వేదపండితులు యాగక్రతువులో పాల్గొంటున్నారు. మూడు యాగశాలల్లో 27 హోమ గుండాల వద్ద 300 మంది రుత్వికులు ఈ యాగం నిర్వహిస్తున్నారు.