తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్లను ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ కలిశారు. ఈ సందర్భంగా బల్గేరియాలో జరిగిన పోటీల్లో గోల్డ్మెడల్ సాధించినందుకు జరీన్కు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్లు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డ బంగారు పతకం సాధించడం గర్వంగా ఉందని కేటీఆర్ అభినందించారు. నిఖత్ జరీన్ పోరాట స్పూర్తిని, పట్టుదలను కొనియాడిన కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి బాక్సింగ్లో అద్భుతమైన ప్రతిభాపాటవాలతో యువతకు స్పూర్తిగా నిలుస్తుందని అభినందించారు. నిఖత్ జరీన్కు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహాకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.