హైదరాబాద్ నగరంలోని మొజాంజాహి మార్కెట్ను పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ మార్కెట్ ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన పనులపై కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. రూ. 10 కోట్లతో ప్రాథమిక అంచనాతో పునరుద్ధరణ పనులకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రచించింది. మంత్రి కేటీఆర్ వెంట పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు