జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి శ్రీ కేటి రామా రావు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెట్పల్లిలోని వట్టివాగుపై రూ.5.83 కోట్ల ఖర్చుతో చేపట్టిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం. అనంతరం జగిత్యాల మండలంలోని నూకపల్లి గ్రామంలో ప్రభుత్వం రూ.230 కోట్లతో నిర్మించే 4160 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ విద్యాసాగర్ రావు, శ్రీ బోడిగే శోభ,ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.