ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. కండ్లకోయ వద్ద 1.10 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎక్స్ప్రెస్వేను రూ. 125 కోట్ల వ్యయంతో నిర్మించారు. కండ్లకోయ జంక్షన్ పూర్తవడంతో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ మహేందర్రెడ్డి, ఎంపీ శ్రీ మల్లారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.